యాదగిరిగుట్ట : ఫిబ్రవరి 10, ( నేటి తెలుగు పత్రిక ప్రతినిధి ): తెలంగాణ రాష్ట్ర వికలాంగుల సమితి ఆధ్వర్యంలో ముఖ్య అతిధిగా పాల్గొన్న పసునూరి శ్రీనివాస్ నటుడు చీప్ గెస్ట్ సోమవారం రోజున రవీంద్రభారతిలో జరిగిన మహాత్మా గాంధీ జాతీయ అవార్డు మహోత్సవంలో యాదాద్రి భువనగిరి జిల్లా వికలాంగుల హెల్పింగ్ సొసైటీ ఆధ్వర్యంలో గత 2006 సంవత్సరము నుండి వికలాంగులకు అందిస్తున్న సేవలను గుర్తించి “సింగారం రమేష్” గారిని శాలువాతో ఘనంగా సన్మానించి మెమెంటో అందజేయడం జరిగింది.ఈ సందర్భంగా సింగారం రమేష్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర వికలాంగుల సమితి కమిటీ వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో మోనార్ దుర్గ ప్రసాద్ గారు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి.ఆర్.వి.ఎస్ షేక్ నయీమ్, టి.ఆర్.వి.ఎస్ మోహన్ మున్నా, వ్యవస్థాపక టి.ఆర్.వి.ఎస్ గార్లు పాల్గొన్నారు.

