యాదగిరిగుట్ట : ఫిబ్రవరి 10 ( నేటి తెలుగు పత్రిక ప్రతినిధి ): మంగళవారం రోజు యాదగిరిగుట్ట మున్సిపాలిటీలోని 5వ వార్డుకు సంబంధించిన కంసాని సంపత్, ప్రవీణ్, సింగం క్రాంతి, వంశీ, నరసింహ, సాయి, సూర్య, హరీశ్, ప్రశాంత్, టిల్లు గార్లతో పాటు సుమారు 50 మంది యువకులు బిఆర్ఎస్ పార్టీకి ఆకర్షితులై మాజీ డిసిసిబి చైర్మన్, టెస్కాబ్ మాజీ వైస్ చైర్మన్ శ్రీ గొంగిడి మహేందర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో బిఆర్ఎస్ పార్టీలో చేరారు, ఈ సందర్భంగా మహేందర్ రెడ్డి గారు వారికి బిఆర్ఎస్ పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
