కరీంనగర్, నేటి తెలుగు పత్రిక: ప్రతి బ్యాంకు ఖాతాదారు తమ కేవైసీ (KYC) వివరాలను సకాలంలో అప్డేట్ చేయడం అత్యంత అవసరమని జిల్లా కలెక్టర్ తెలిపారు. కేవైసీ అప్డేషన్ ద్వారా బ్యాంకింగ్ లావాదేవీలు సురక్షితంగా ఉంటాయని, ప్రభుత్వ పథకాల లబ్ధి సక్రమంగా అందుతుందని తెలిపారు. అందువల్ల కరీంనగర్ జిల్లాలోని అన్ని బ్యాంకు ఖాతాదారులు తమ సమీప బ్యాంకు శాఖను వెంటనే సందర్శించి కేవైసీ అప్డేషన్ ప్రక్రియను పూర్తి చేయాలని విజ్ఞప్తి చేశారు.ఫైనాన్షియల్ లిటరసీ వీక్ కార్యక్రమంలో భాగంగా జిల్లా వ్యాప్తంగా గ్రామ సభలు, అవగాహన కార్యక్రమాలు, ర్యాలీలు మరియు ఇతర కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు.
