Breaking News

బుగ్గ దేవస్థానాన్ని తాండూర్ పంచాయతీలోకి మార్చాలని వినతి

బెల్లంపల్లి, ఫిబ్రవరి 10 (నేటి తెలుగు పత్రిక): బెల్లంపల్లి మండలంలోని శ్రీ బుగ్గ రాజరాజేశ్వర స్వామి దేవస్థానాన్ని తాండూర్ గ్రామపంచాయతీ పరిధిలోకి మార్చాలని స్థానిక బి ఆర్ ఎస్ నాయకులు మాసాడి శ్రీరాములు మంగళవారం తాండూర్ తహసిల్దార్ జ్యోత్స్న కు వినతి పత్రం అందజేశారు. గత కొన్నేళ్లుగా బెల్లంపల్లి మండల పరిధిలో కొనసాగుతున్న బుగ్గ దేవస్థానం రెవెన్యూ రికార్డుల పరంగా తాండూర్ గ్రామపంచాయతీలో ఉందని తెలిపారు. రెవెన్యూ రికార్డులను పరిశీలించి బెల్లంపల్లి మండలంలోని ఈ దేవస్థానాన్ని తాండూర్ గ్రామపంచాయతీలోకి వెంటనే మార్చాలన్నారు. అనంతరం బెల్లంపల్లి సబ్ కలెక్టర్ మనోజ్ ను కలిసి వినతి పత్రాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో బుగ్గ దేవస్థానం మాజీ చైర్మన్ మాసాడి శ్రీదేవి, బీ ఆర్ ఎస్ తాండూర్ మండల అధ్యక్షులు ఎస్ .దత్తు మూర్తి, ఉపసర్పంచ్ దత్తాత్రేయరావు, మాజీ సింగిల్ విండో చైర్మన్ పి .చంద్రశేఖర్, ఎలుక రామన్న, పెరిక రాజన్న తదితరులు పాల్గొన్నారు.

పోక్సో కేసులో హైకోర్టును ఆశ్రయించిన బండి భగీరథ్

‘భోగి’లో డింపుల్ హయతి పవర్‌ఫుల్ లుక్ వైరల్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *