Breaking News

ఓటు హక్కు వినియోగించుకున్న “అల్ఫోర్స్” నరేందర్ రెడ్డి

కరీంనగర్, నేటి తెలుగు పత్రిక: ఓటు చాలా విలువైనదని మరియు సమాజాభివృద్ధిలో కీలకంగా వ్యవహరిస్తుందని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు విఎన్ఆర్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు “అల్ఫోర్స్” డాక్టర్ వి.నరేందర్ రెడ్డి మున్సిపల్ ఎన్నికల సందర్భంగా స్థానిక 52 డివిజన్ లోని ఓటింగ్ కేంద్రంలో వారి ఓటు హక్కును వినియోగించిన అనంతరం మాట్లాడుతూ అర్హత కలిగిన ప్రతి ఒక్క ఓటరు ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవడమే కాకుండా సమాజాభివృద్ధిలో భాగం కావాలని పిలుపునిచ్చారు. ప్రతి ఓటు చాలా విలువైనదని ప్రధానంగా ప్రజాస్వామ్యంలో ఓటు హక్కుకు ప్రత్యేకమైన స్థానమున్నదని అని వారు గుర్తు చేశారు. ఓటు ద్వారానే ప్రభుత్వం ఏర్పడుతుందని ఆ ప్రభుత్వం ద్వారానే అభివృద్ధి జరుగుతుందని గుర్తు చేస్తూ ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకొని ఇతరులకు ఆదర్శంగా నిలవాలని కోరారు.
మొట్ట మొదటిసారిగా ఓటు వేసేవారు ఆలోచించి సరైన నాయకునికి ఓటు వేసి అభివృద్ధికి చేయూతనివ్వాలని అయన పిలుపునిచ్చారు.

పోక్సో కేసులో హైకోర్టును ఆశ్రయించిన బండి భగీరథ్

‘భోగి’లో డింపుల్ హయతి పవర్‌ఫుల్ లుక్ వైరల్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *