విజయవాడ: సెంట్రల్ ఫిబ్రవరి 11 నేటి తెలుగు పత్రిక ప్రతినిధి: శ్రీవారి లడ్డు కల్తీపై హిందూ మనోభావాలు దెబ్బతిన్నాయని పవిత్ర పుణ్యక్షేత్రం అయిన ఏడుకొండల వెంకటేశ్వర స్వామి శ్రీవారి ప్రసాదం కల్తీ చేయడం పెద్ద అపచారమని సెంట్రల్ జనసేన డివిజన్ కార్యకర్తలు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సంర్భంగా విజయవాడ గాంధీ నగర్ స్థానిక ప్రెస్ క్లబ్ లో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో జనసేన సెంట్రల్ డివిజన్ నాయకులు మాట్లాడుతూ కల్తీ నెయ్యి వ్యవహారాన్ని పక్కదోవ పట్టించడానికి అంబటి రాంబాబును తెరపైకి తీసుకువచ్చారని రాష్ట్రంలో అలజడులు సృష్టిస్తూ రాష్ట్ర ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నారని ఆరోపించారు సిట్ విచారణలో లడ్డు కల్తీ జరిగిందని తెలిపింది. 68 కోట్ల లీటర్ల కల్తీ నెయ్యిలో 250 కోట్ల రూపాయల వైఎస్ఆర్సిపి ప్రభుత్వం అవినీతికి పాల్పడింది అన్నారు. భారతదేశంలో ఉన్నామా పాకిస్తాన్ లో ఉన్నామా అయోమయ పరిస్థితి ఏర్పడింది ధన లాభం కోసం ప్రజల ఆరోగ్యం గాలికి వదిలేసి ఇంతటి దారుణానికి పాల్పడ్డారని గతంలో కూడా వైఎస్ ఆర్సిపి ప్రభుత్వం కల్తీ మద్యం తయారుచేసి ప్రజల ప్రాణాలతో ఆడుకున్నారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం అంటేనే కల్తీ రెడ్డి ప్రభుత్వం అని మన దేశంలో జరుగుతున్న ఈ దారుణాన్ని హిందూ సంఘాలు అందరూ కలిసికట్టుగా పోరాటాలు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో యంపాటీ ప్రభుజి, కెంబూరి భవాని, తుప్పల శ్రీనివాస్, తాడి దుర్గారావు, పైల ప్రకాష్, కె. నరేంద్ర, సి.హెచ్ నాగమణి, ఉదయ్ రెడ్డి, అరుణ, మహేష్, సురేష్ పి. శ్రీని వాస్ జనసేన విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం అధ్యక్షులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.
