కోదాడ, ఫిబ్రవరి 12(నేటి తెలుగు పత్రిక): సూర్యాపేట జిల్లా, నడిగూడెం మండలం, రామాపురం గ్రామానికి చెందిన ,తెలంగాణ సాయుధ పోరాట యోధులు నేలమర్రి తిరపయ్య కుమారుడు సిపిఎం సీనియర్ నాయకులు నేలమర్రి రాములు అనారోగ్యంతో మృతి చెందారు. ఆయన మృతి పట్ల ,తెలంగాణ రైతు సంఘం జిల్లా నాయకులు వీరాంజనేయులు, ఏనుగుల మోహన్రావు, అప్పారావు, కృష్ణ సాగర్ వీరబాబు , పవన్ ,నేలమర్రి కోటయ్య ,తిరపయ్య , నాగేష్ , శ్రీను, శంకర్ , వెంకటేశ్వర్లు,తదితరులు నివాళులర్పించి, పార్థివ దేహం పై ఎర్రజెండా కప్పి నివాళులర్పించి ,సంతాపం తెలిపారు. రాములు మృతి కుటుంబానికి ,సిపిఎం పార్టీకి తీరని లోటు అని అన్నారు.

