కాంగ్రెస్ జండాలతో నివాళి.
హటాత్ మరణం కాపు కులానికి తీరని లోటు – చందు జనార్దన్.
ఉండవల్లి, నేటి తెలుగు పత్రిక: వంగవీటి మోహన్ రంగా అనుచరుడు, కాంగ్రెస్ వాది.. రాధా రంగా మిత్ర మండలి సభ్యులు ఉండవల్లి గ్రామ కాపు పెద్ద ఉప్పు హరిబాబు హఠాత్ మరణం తీవ్ర ద్రాంతికి గురి చేసిందని కాపు జేఏసీ రాష్ట్ర అధ్యక్షులు చందు జనార్ధన్ అన్నారు. గురువారం ఉదయం 10 గంటలకు ఉండవల్లి సెంటర్లోని ఎస్బిఐ బ్యాంకు సమీపంలో ఉప్పు హరిబాబు స్వగృహంలో ఆయన పార్థివ దేహానికి చందు జనార్దన్, జనసేన నేత జొన్న రాజేష్ పూలదండలు వేసి నివాళులు అర్పించారు.ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు చెవ్వాకుల కోటేష్ బాబు, అంబటి తిరుపతిరావు, సింగంశెట్టి వెంకటేశ్వరరావు, జొన్న రామలింగేశ్వరరావు, గాదె నాగభూషణం, తెలుగుదేశం నేతలు, గ్రామపెద్దలు, పెద్ద సంఖ్యలో గ్రామస్థులు అభిమానులు పాల్గొన్నారు.
