19 న హైదరాబాదులో బహుమతి ప్రధానం.
కోదాడ ,ఫిబ్రవరి 12 (నేటి తెలుగు పత్రిక): ”భూపతి చంద్ర’ స్మారక కథానికల పోటీ – 2026 పురస్కారాల ప్రదానోత్సవ సభ ఈ నెల 19వతేది గురువారం సాయంత్రం గం॥ 5-00 ని॥లకు డా|| దేవులపల్లి రామానుజరావు కళా మందిరం, తెలంగాణ సారస్వత పరిషత్తు, తిలక్ రోడ్, ఆబిడ్స్, హైదరాబాదు నందు నిర్వ హిస్తున్నామని అధ్యక్షులు ఎమ్.ఎల్. కాంతారావు తెలియజేశారు.
ఆ సందర్భంగా విజేతలకు బహుమతులు అందజేయనున్నట్లు తెలిపారు.
ప్రథమ బహుమతి
శ్రీ సుంకోజి దేవేంద్రాచారి – “అంతర్ధానం”
ద్వితీయ బహుమతి
శ్రీ పొత్తూరి సీతారామరాజు – “పులి నెత్తుటి ముగ్గు”
తృతీయ బహుమతి
శ్రీ పుప్పాల కృష్ణమూర్తి – “కన్నీట వసంతం”
ప్రోత్సాహక బహుమతులు:
డాక్టర్ ఎం. సుగుణ రావు – “ఒక కొడుకు తీర్పు”
శ్రీ చొక్కర తాతారావు – “ఇచ్చోటనే కద”
శ్రీ మొయిద శ్రీనివాసరావు – “అంబటి తట్ట”
శ్రీమతి ఉయ్యూరు అనసూయ – “రెండో కోణం”
శ్రీ మధుసూదన రావు – “కర్టెన్” ; కథానికలకు అందించనున్నామని అన్నారు.
