కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ తో పాటు మరొ ఇద్దరిపై మూడు కేసులు నమోదు.
కరీంనగర్, నేటి తెలుగు పత్రిక: నగరంలోని కిసాన్ నగర్ పరిధిలో ఎన్నికల నిబంధనలను ఉల్లంఘించిన ఘటనలపై పోలీసులు మూడు వేర్వేరు కేసులు నమోదు చేశారు. కిసాన్ నగర్ లో ఓటర్లను ప్రలోభపెట్టేందుకు డబ్బులు పంపిణీ చేస్తున్నారన్న సమాచారంతో పోలీసులు తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీల్లో ఇద్దరు వ్యక్తులు వేరు వేరుగా ఓటర్లకు నగదు పంచుతూ రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డారు.వారిలో ఒకరు కరీంనగర్ అంబేద్కర్ నగర్ కు చెందిన కుర్ర తిరుపతి (45) వద్ద 44 వేల 500 వందల రూపాయల నగదుపట్టుబడగా అతనిపై కేసు నమోదు (Cr. No. 52/2026, USec. 173, 223 BNS Act, r/w 171-H P.R. Act: ) చేసారు.
ఎమ్మెలే గంగుల కమలాకర్ తో పాటు మరో ఏడుగురిపై కేసు నమోదు. కిసాన్ నగర్ కు చెందిన లొకిని జంపయ్య(35)
నుండి 47 వేల రూపాయల నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఎన్నికల కోడ్ ఉల్లంఘించినందుకు సదరు వ్యక్తిని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కు తరలిస్తుండగా, స్థానిక ఎమ్మెల్యే జోక్యం చేసుకుని పోలీసుల విధులకు ఆటంకం కలిగించారు. పోలీసుల అదుపులో ఉన్న వ్యక్తిని బలవంతంగా, అనధికారికంగా విడిపించుకుని వెళ్లడంతోపాటు, ఘటన జరిగిన ప్రదేశంలో ధర్నా చేస్తూ శాంతిభద్రతలకు భంగం కలిగించారు. ఈ చర్య ఎన్నికల నియామావళిని ఉల్లంఘించినందుకుగాను ఎమ్మెల్యే గంగుల కమలాకర్ తో పాటు కుర్ర తిరుపతి,ఎడ్ల. అశోక్, అమరగొండ అశోక్, ఎడ్ల సరిత, పెరుక మంజుల, బేజుగం మధు లను బాధ్యులను చేస్తూ మొత్తం 08మందిపై మరో కేసునమోదు ( Cr. No. 53/2025, U/sec. 173, 221, 223, 126(2), r/w 3(5) BNS Act, sec. 171-H of PR Act:- ) చేసినట్లు కరీంనగర్ త్రీ టౌన్ ఇన్స్పెక్టర్ గుర్రం తిరుమల్ తెలిపారు.
అంతేకాకుండా ఈ ఘటన జరిగిన అనంతరం అక్కడే ప్రెస్ మీట్ నిర్వహించి ఓటర్లను, వారికే ఓటు వేయాలని కోరి ఎన్నికల నియామవాళి ఉల్లంఘనలకు పాల్పడినందుకు గాను ఎమ్మెల్యే గంగుల కమలాకర్ తో పాటు, ఎడ్ల అశోక్, కుర్ర తిరుపతిలపై మరొక కేసు నమోదు ( మూడవ కేసు Cr. No. 54/2026, u/sec. 223 r/w 3(5) BNS Act: ) చేసారని త్రీ టౌన్ ఇన్స్పెక్టర్ తిరుమల్ తెలిపారు.ఎన్నికల సమయంలో శాంతిభద్రతలకు విఘాతం కలిగించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా సీపీ గౌష్ ఆలం హెచ్చరించారు.
