- మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు దానావత్ శంకర నాయక్.
యాదగిరిగుట్ట : ఫిబ్రవరి 13 : ( నేటి తెలుగు పత్రిక ప్రతినిధి ): రాష్ట్రంలో ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారి పాలనకు అభివృధి పనులకు, సంక్షేమానికి పట్టణ ప్రజలు పట్టం కట్టారని అలాగే ఆలేరు నియోజకవర్గంలో ప్రభుత్వ విప్ ఆలేరు శాసనసభ్యులు శ్రీ బీర్ల అయిలయ్య గారి అభివృద్ధిని చూసి ఆలేరు, యాదగిరి గుట్ట మున్సిపాలిటీ ప్రజలు కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టారని, రాష్ట్రంలో ప్రజా పాలనకు ఈ ఎన్నికలే నిదర్శనం, ఇప్పటికైన ప్రతిపక్ష పార్టీలకు కన్నువిప్పు కావాలని, అలాగె త్వరలో జరిగబోయే జెడ్పీటీసీ, ఎంపిటిసి ఎన్నికలలో కూడా కాంగ్రెస్ పార్టీ విజయ ఢంకా మోగిస్తుందని,కాంగ్రెస్ ప్రభుత్వానికే తిరుగులేదని మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు దానావత్ శంకర నాయక్ తెలిపారు.
