విజయవాడ. సెంట్రల్ ఫిబ్రవరి 14 నేటి తెలుగు పత్రిక ప్రతినిధి: త్రీ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ రోడ్డు శారద కాలేజ్ జంక్షన్ నుండి ఐరాక్స్ థియేటర్ వరకు రహదారులపై కొంత మంది వ్యాపారస్తులు రోడ్ల ను ఆక్రమించి వ్యాపార కార్యకలాపాలు నిర్వహించడం వల్ల ట్రాఫిక్కు అంత రాయం కలుగుతున్న విష యాన్ని గమనించిన పోలీ సులు వారు సూచనలు తెలియజేశారు. ఈ సందర్భంగా విజయవాడ బి సత్యనారాయణసంబంధిత వ్యాపారస్తులకు రహదా రులపై ఎటువంటి ఆక్రమ ణలు చేయరాదని, ప్రజల రాకపోకలకు, వాహనాల సాఫీగా ప్రయాణానికి ఇబ్బందులు కలగకుండా చూడవలసిందిగా స్పష్టం గా తెలియజేయబడింది. ఆక్రమణలను స్వచ్ఛందం గా వెంటనే తొలగించుకోవా లని, లేనిచో చట్టపరమైన చర్యల ద్వారా ఆక్రమణల ను తొలగించబడతాయని హెచ్చరించడమైనది. ఈ విషయమై వ్యాపారస్తులు సానుకూలంగా స్పందించి, స్వచ్ఛందంగా ఆక్రమణ లను తొలగించుకుంటామ ని మర్యాదపూర్వకంగా ట్రీ ట్రాఫిక్ పోలీసులకు పూర్తి గా సహకరిస్తామని తెలిపా రు. ఈ కార్యక్రమం ట్రీ ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ కిషోర్ బాబు కొత్తూరు ఆధ్వర్యం లో నిర్వహించబడింది. ఈ కార్యక్రమంలో RSI GVN కుమార్ ట్రాఫిక్ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

