Breaking News

శభాష్ పద్మక్క! అమ్మ పద్మమ్మ కు సీఎం రేవంత్ రెడ్డి మిర్యాలగూడ సభలో కితాబ్ !

నేటి తెలుగు పత్రిక: కోదాడ గడ్డ ,పద్మక్క అడ్డ నిరూపణ! కోదాడ పిబ్రవరి 14 తెలంగాణ రాష్ట్రంలో కోదాడ ఎమ్మెల్యే పద్మావతి రెడ్డికి అరుదైన గౌరవం దక్కింది. రాష్ట్రంలో మున్సిపాలిటీ ఎన్నికల్లో కోదాడలో మూడు స్థానాలను ఏకగ్రీవం చేసి మొదటి స్థానంలో నిలిచింది. మున్సిపాలిటీ ఎన్నికల్లో కోదాడ మున్సిపాలిటీని కాంగ్రెస్ పార్టీ ఎక్కువ మెజార్టీ సాధించి,కైవసం చేసుకుంది. మొత్తం 35 వార్డులు కాగా మూడు స్థానాలను ఏకగ్రీవంగా కాంగ్రెస్ పార్టీ ఛేజిక్కుంచుకుంది. మిగతా 32 స్థానాలకు ఎన్నికలు జరుగగా శుక్రవారం నాడు లెక్కింపు అనంతరం విడుదల చేసిన ఫలితాలలో 23 స్థానాలలో కాంగ్రెస్, 5గురు ఇండిపెండెంట్ అభ్యర్థులు, ముగ్గురు బి ఆర్ ఎస్ అభ్యర్థులు గెలుపొందారు. కాంగ్రెస్ మద్దతుతో ఒక ఇండిపెండెంట్ అభ్యర్థులు విజయం సాధించారు. మొత్తంగా 27స్థానాలలో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించి కోదాడ మున్సిపాలిటీ పై ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి తన పట్టును నిలుపుకోగా , బి ఆర్ ఎస్ పార్టీ కేవలం మూడు స్థానాలకు పరిమితమై ఛతికిలపడింది. గెలిచిన 5గురు ఇండిపెండెంట్ అభ్యర్థులు కూడా కాంగ్రెస్ రెబెల్స్ కావడం విశేషం. ఏకగ్రీవాలపై మిర్యాలగూడలో నిర్వహించిన బహిరంగ సభలో సీఎం రేవంత్ రెడ్డి ఎమ్మెల్యే పద్మావతి రెడ్డిని అభినందించారు.

గీతవృత్తిలో ప్రమాదాలకు గురై గీత కార్మికులకు రావలసిన ఎక్స్ గ్రేషియాలకు నిధులు విడుదల చేయాలి.

క్రీడా పోటీలు మహిళా క్రీడాకారిణుల్లో ఆత్మవి శ్వాసాన్ని పెంపొందిస్తాయి: మంత్రి మండిపల్లి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *