పులివెందుల ఫిబ్రవరి 14 ( నేటి తెలుగు పత్రిక ప్రతినిధి): కడప జిల్లా లింగాల మండలం దిగవపల్లి శ్రీ అభయ ఆంజనేయ స్వామి ఆలయంలో వారం రోజులు పాటు నిర్వహించిన భాగవత సప్తాహం శనివారం విజయవంతంగా ముగిసింది. భాగవత సప్తహ పఠనం పులివెందుల భాగవత భక్త సమాజం నిర్వ హానలో దాతల సహకారంతో దిగ్విజయ వంతంగా సాగినపఠనం పఠనం అనంతరం మంత్ర పుష్పం మహిళలచే కలశ ప్రదర్శనం చివరిగా భాగవత పండితులకు నిర్వ హుకులు ఘన సన్మానం చేపట్టారు కాగా 7 రోజులపాటు అల్పాహారం అన్నదాన కార్యక్రమం నిర్వహించిన దాతలకు సమాజ పాలక వర్గం వారు ధన్య వాదాలు తెలిపారు. కార్యక్రమంలో అధ్యక్షులు చిన్నశివారెడ్డి సలహాదారులు, నారాయణరెడ్డి, గంగిరెడ్డి, నారాయణరెడ్డి రంగ నాథ్, మీడియా కోఆర్డినేటర్ యాగంటి బాల కృష్ణారెడ్డి గ్రామస్థులు తదితరులు పాల్గొన్నారు.
