అన్నమయ్య జిల్లా ఎస్టియు అధ్యక్షుడు అంకం శివారెడ్డి.
రాయచోటి, ఫిబ్రవరి 14 (నేటి తెలుగు పత్రిక): ఉద్యోగులకు రావాల్సిన పిఆర్సి మరియు ఐఆర్ కు బడ్జెట్ కేటాయించకపోవడం అన్యాయని అన్నమయ్య జిల్లా ఎస్టియు జిల్లా అధ్యక్షుడు అంకం శివారెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. శనివారం ఆంధ్రపత్రిక విలేకరులతో ఆయన మాట్లాడుతూ గత 15 నెలలుగా రిటైర్ అయిన ఉద్యోగులకు రావలసిన గ్రాడ్యుటీ కేటాయింపులు చేయకపోవడం బాధాకరమని ఆయన చెప్పారు. అలాగే ఉద్యోగులకు రావలసిన బకాయిలకు గాను కేటాయింపులు చేయకపోవడం దారుణం. ఇప్పటికే ఎన్టీఆర్ వైద్య సేవలు మొత్తం నత్త నడకన నడుస్తూ ఉంటే కేవలం నాలుగు వేల కోట్లు కేటాయించడం ఏమాత్రం సరిపోదు. రావలసిన మెడికల్ బిల్లు లు చాలా ఉన్నాయన్నారు.విద్యారంగానికి 32,308 కోట్లు ఏమాత్రం సరిపోదన్నారు.మొత్తం రాష్ట్ర బడ్జెట్ లో విద్యా రంగానికి కేటాయింపులు పెంచాలని ఈ సందర్భంగా ఆయన రాష్ట్ర ప్రభుత్వానికి కోరారు.
