తెనాలి రోడ్డు విస్తరణకు సహకరించాలి.
ముస్లింల ఖబర్ స్థాన్ కు ఎటువంటి ఇబ్బంది లేదు.
ఏ ఒక్క సమాధిని తొలగించం.
నగరపాలక సంస్థ కమిషనర్ అలీమ్ బాషా
మంగళగిరి ఫిబ్రవరి 14 ( నేటి తెలుగు పత్రిక ప్రతినిధి): ప్రజల సహకారంతోనే నగర అభివృద్ధి సాధ్య పడుతుందని, నగరంలోని తెనాలి రోడ్డు విస్తరణ కు స్థానిక ప్రజలు కుల, మతాలకు అతీతంగా సహకరించాలని కమిషనర్ అలీమ్ బాషా కోరారు. శనివారం ఆయన మాట్లాడుతూ నగరంలో నానాటికి పెరిగిపోతున్న ట్రాఫిక్ తో ఎంతో మంది ప్రజలు రాకపోకలకు ఇబ్బందులు పడుతున్నారని, ఈ నేపథ్యంలో నియోజకవర్గ ఎమ్మెల్యే, రాష్ట్ర ఐటీ, విద్యాశాఖల మంత్రి నారా లోకేష్ సూచనల మేరకు తెనాలి రోడ్డు విస్తరణ చేపట్టేందుకు నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.తెనాలి రోడ్డు విస్తరణకు కబరస్తాన్ ను ఏమాత్రం కదిలించకుండా ఫ్లైఓవర్ నిర్మించి రహదారిని విస్తరించే విధానాన్ని మ్యాప్ ద్వారా మీడియాకు చూపుతున్న కమిషనర్ అలీమ్ భాష 160 అడుగుల రోడ్డు గా విస్తరించనున్నామని, ఇందుకు గానూ ఇప్పటికే ఉన్న రహదారికి ఇరువైపులా కేవలం 16-17 అడుగుల మేర విస్తరించడం జరుగుతుందని తెలిపారు. ఈ క్రమంలో అదే మార్గంలో ఉన్న ముస్లిం ఖబర్ స్థాన్ (స్మశాన వాటిక) లోని ఖబర్ (సమాధులు) కు వచ్చే ఇబ్బంది ఎంతమాత్రం ఉండదన్నారు. రోడ్డు మధ్యలో 6-8 అడుగుల మేర ఫిల్లర్లు వేసి క్యాంటీ లివర్ (ఫ్లై ఓవర్) రహదారి విస్తరణ నిర్మాణం చేపట్టడం జరుగుతుందని కమిషనర్ అలీమ్ బాషా స్పష్టం చేశారు. కావున తెనాలి రోడ్డు విస్తరణ కు స్థానిక ప్రజలు సహకరించాలని ఆయన కోరారు.
