Breaking News

విజేతలను సన్మానించిన మాజీఎమ్మెల్యే.

కోదాడ ,ఫిబ్రవరి 14(నేటి తెలుగు పత్రిక): కోదాడ పట్టణంలో ఇటీవల జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో 9వ వార్డు నుండి బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా పోటీచేసి గెలుపొందిన చీమ నరేష్ బాబు స్థానిక బీఆర్ఎస్ నాయకులతో కలిసి కోదాడ మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ ని మర్యాదపూర్వకంగా కలిశారు.ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే మల్లయ్య యాదవ్ చీమ నరేష్ బాబును ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. అలాగే తొమ్మిదవ వార్డు ప్రజలు పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయకుండా పనిచేయాలని, నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉంటూ వార్డు అభివృద్ధికి కృషి చేయాలని సూచించారు.అనంతరం నరేశ్ బాబు విజయానికి అహర్నిశలు కృషి చేసిన స్థానిక బీఆర్ఎస్ పార్టీ నాయకులకు, వార్డు పెద్దలకు, ఓటేసి ఆశీర్వదించిన వార్డు ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు.

గీతవృత్తిలో ప్రమాదాలకు గురై గీత కార్మికులకు రావలసిన ఎక్స్ గ్రేషియాలకు నిధులు విడుదల చేయాలి.

క్రీడా పోటీలు మహిళా క్రీడాకారిణుల్లో ఆత్మవి శ్వాసాన్ని పెంపొందిస్తాయి: మంత్రి మండిపల్లి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *