Breaking News

క్రీడా పోటీలు మహిళా క్రీడాకారిణుల్లో ఆత్మవి శ్వాసాన్ని పెంపొందిస్తాయి: మంత్రి మండిపల్లి

విజయవాడ. ఫిబ్రవరి 14 సెంట్రల్ నేటి తెలుగు పత్రిక ప్రతినిధి: జాతీయ స్థాయి పోటీలు మహిళా క్రీడాకారిణుల్లో ఆత్మవిశ్వాసాన్ని పెంపొం దించి, క్రీడా సంస్కృతి అభివృద్ధికి దోహదపడతా యని, మహిళల నెట్‌బాల్ అభివృద్ధికి రాష్ట్ర ప్రభు త్వం సంపూర్ణ మద్దతు అందిస్తుందని మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి స్పష్టం చేశారు.(2025–26) ఆల్ ఇండియా ఇంటర్ వుమెన్ టోర్నమెంట్ యూనివర్సిటీ నెట్ బాల్ ను కృష్ణా యూనివర్సిటీ, మచిలీపట్నం ఆధ్వర్యంలో విజయవాడలోని మార్స్ స్టెల్లా కాలేజ్ లో నిర్వహి స్తున్నారు. దేశవ్యాప్తంగా 88 విశ్వవిద్యాలయాల జట్లు పాల్గొంటున్న ఈ పోటీలు నాకౌట్ కం లీగ్ పద్ధతిలో జరుగుతున్నాయి. ఈ టోర్నమెంట్ ప్రారం భోత్సవం ఫిబ్రవరి 14 ఉదయం నుండి నిర్వహిం చనుండగా రాష్ట్ర రవాణా, యువజన, క్రీడ శాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డి ముఖ్య అతిధిగా హాజర య్యారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్, ప్రిన్సిపల్ ఇన్యాసమ్మ, ప్రొఫెసర్ శ్రీనివాస రావు, నవీన లావణ్యలత తదితరులు పాల్గొన్నారు.

గీతవృత్తిలో ప్రమాదాలకు గురై గీత కార్మికులకు రావలసిన ఎక్స్ గ్రేషియాలకు నిధులు విడుదల చేయాలి.

ఉన్నత విద్యతోనే విద్యార్థులకు ఉజ్వల భవిష్యత్తు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *