యాదగిరిగుట్ట : ఫిబ్రవరి 15 : ( నేటి తెలుగు పత్రిక ప్రతినిధి ): మాజీ పార్లమెంట్ సభ్యులు, కామ్రేడ్ బొమ్మగాని ధర్మబిక్షం గౌడ్ 104 వ జయంతి సందర్భంగా ఆత్మకూరు ఎం మండల కేంద్రంలోని మెయిన్ రోడ్డు వద్ద ఆయన విగ్రహానికి సర్పంచ్ బీసు “ధనలక్ష్మి చందర్ గౌడ్” పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కామ్రేడ్ ధర్మ బిక్షం గారు తెలంగాణలోని పేద ప్రజల కోసం మరియు గీత కార్మికులకు హక్కుల కోసం నిరంతరం పోరాడిన మహా వ్యక్తి అని ఆయన చేసిన సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో గౌడ సంఘం రాష్ట్ర నాయకులు బీసు చందర్ గౌడ్, గనగాని మల్లేష్ గౌడ్, గుండెగాని ఐలయ్య, నాతి రాజు, రంగ సత్యనారాయణ, లోడి శ్రీను పొన్నగాని జహంగీర్,బొడిగె వెంకన్న, పోతగాని మల్లేష్,రంగ స్వామి, పంజాల కృష్ణమూర్తి, శిగ శ్రీను,మాధ సత్తయ్య,రంగ వెంకన్న,బూడిద రాజు, నర్సయ్య, లోడి రవి, పరకాల వెంకటయ్య, చెరుకు శీను, బబ్బురి శివలింగం, రంగ శ్రీను,చెరుకు విష్ణు, బూడిద శేఖర్,రాగటి మచ్చగిరి, మల్లేష్ తదితరులు పాల్గొన్నారు.
