కోదాడ ఫిబ్రవరి 15(నేటి తెలుగు పత్రిక): కోదాడ మున్సిపాలిటీకి ఉత్కంఠగా జరగనున్న చైర్మన్ ఎంపిక ప్రక్రియలో విప్ జారీ చేసే బాధ్యత మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు చింతలపాటి శ్రీనివాసరావుకు అప్పగించారు… ఇప్పటికే కాంగ్రెస్ కౌన్సిలర్లను హైదరాబాద్ క్యాంపుకు తరలించే విషయం తెలిసిందే… చైర్మన్ పదవికి ఎర్నేని కుసుమ వెంకటరత్నం బాబు, పారా సత్యవతి సీతయ్య, దేవరపల్లి మల్లీశ్వరి, గుండపనేని పద్మావతి నాగేశ్వరరావు, ఎస్కే నేహా పోటీపడుతున్నారు.. కోదాడ మున్సిపాలిటీ చైర్మన్ గిరి ఎవరికి దక్కుతుందోనని పట్టణ ప్రజలు ఎదురుచూస్తున్నారు.. అయితే అధినాయకుడు మాత్రం తన సన్నిహితులకు కూడా ఈ అంశంపై చర్చించకపోవడంతో ఉత్కంఠ మరీ పెరిగిందని చెప్పవచ్చు.. రేపటి వరకు ఈ ఉత్కంఠ కొనసాగా వలసిందే.
