కోదాడ ,ఫిబ్రవరి15 (నేటి తెలుగు పత్రిక): కోదాడలో ఘనంగా మహాశివరాత్రి వేడుకలు మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని కోదాడ దేవాలయాల్లో ఉన్న శివాలయాలు భక్తుల శివనామస్మరణతో మారుమోగాయి. ఆదివారం పట్టణంలోని వీరబ్రహ్మేంద్ర స్వామి దేవాలయం లో ఉన్న కాశీ విశ్వేశ్వర స్వామి ఆలయంతో పాటు కోదండ రామాలయం, అయ్యప్ప స్వామి దేవాలయంలో శివాలయాలకు భక్తులు తెల్లవారుజామునే శివుడికి అభిషేకాలు జరిపి దేవాలయాల్లో జ్యోతులను వెలిగించి పూజలు నిర్వహించారు. హర హర మహాదేవ శంభో శంకర అంటూ భక్తుల నినాదాలతో ఆలయ పరిసరాలు మారుమోగాయి.

