పులివెందుల ఫిబ్రవరి 15 (నేటి తెలుగు పత్రిక ప్రతినిధి): మహాశివరాత్రి పర్వదినం పురస్కరించుకుని వేంపల్లి త్రిబుల్ ఐటీ కళాశాల విద్యార్థులు ఆదివారం సామాజిక సేవా కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు చక్రాయపేట మండలం గండి క్షేత్రం, వీరభద్ర స్వామి ఆలయం తదితర ఆలయాలలో సేవలు నిర్వహించారు. భక్తుల రద్దీ నియంత్రణలో సహబాష్ అనిపించుకున్నారు. ప్రతి ఏటా మహాశివరాత్రి పండుగ తో పాటు వివిధ కార్యక్రమాలలో త్రిబుల్ ఐటీ ఎన్ ఎస్ ఎస్ వాలంటీర్లు సేవలందిస్తారని డైరెక్టర్ కుమారస్వామి గుప్తా ఈ సందర్భంగా తెలిపారు.
