యాదగిరిగుట్ట : ఫిబ్రవరి 16 : ( నేటి తెలుగు పత్రిక ప్రతినిధి ): కష్టాల్లో ఉన్న పేదలకు అండగా నిలవడంలోనే నిజమైన తృప్తి ఉందని తుర్కపల్లి మండలం గుజ్జవాని కుంట తండా ( బంజారా హిల్స్ )సర్పంచ్ గుగులోతుదూప్ సింగ్ నాయక్ అన్నారు. సోమవారం తండాకు చెందిన ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారురాలు గుగులోతు ప్రమీల- రాజేందర్ నాయక్ కుటుంబానికి ఆయన తన స్వంత ఖర్చులతో 10 బస్తాల సిమెంటును అందజేశారు.ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ.. ప్రభుత్వం మంజూరు చేసిన ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాన్ని లబ్ధిదారులు త్వరగా పూర్తి చేసుకోవాలని కోరారు. ఆర్థిక ఇబ్బందుల వల్ల నిర్మాణం ఆగిపోకూడదనే ఉద్దేశంతో తన వంతు చిన్న సాయంగా ఈ సిమెంటును అందజేసినట్లు తెలిపారు.
