Breaking News

రాష్ట్ర ప్రగతి కి తొడ్పడే బడ్జెట్.

పులివెందుల ఫిబ్రవరి 16(నేటి తెలుగు పత్రిక ప్రతినిధి): 2026-27 సంవత్సరానికి అసెంబ్లీ లో ప్రవేశపెట్టిన బడ్జెట్ రాష్ట్ర ప్రగతి కి ఎంతో తొడ్పడు తుందని అన్ని వర్గాల ప్రజలు కు ఉపయోగ పడుతుందని బ్రాహ్మణ చైతన్య వేదిక రాష్ట్ర నాయకులు పీవీయెస్ వి ప్రసాదరావు సూగురు రఘునాధ రావు లు ఒక ప్రకటన లో ప్రశoశించారు. సంక్షేమం అభివృద్ధి రెండిటిని ప్రాధాన్యత గా తీసుకోవడం పోలవరం అమరావతి నిర్మాణాలకు ప్రాధాన్యత ఇవ్వడం ప్రశoశించ నీయమన్నారు. ఏపీ వెల్త్ ఫండ్ ఏర్పాటు తో ప్రైవేట్ పెట్టుబడులు అధికంగా వచ్చే అవకాశం ఉందని అన్నారు.ముఖ్యం గా రాయలసీమ అభివృద్ధి కి అధిక ప్రాధాన్యత ఇవ్వడం సంతోషం అని 30వేల కోట్లు కేటాయించడం హర్ష నీయమని అన్నారు. బలహీన వర్గాల అభివృద్ధి కి 53వేల కోట్లు కేటాయించడం సంతోషం అని బ్రాహ్మణ కార్పొరేషన్ కు అందులోనే నిధులు కేటాయింపు చేసారని అన్నారు. బ్రాహ్మణ లకు సబ్సిడీ రుణాలు కోసం బడ్జెట్ లో 23కోట్లు కేటాయించడం పట్ల హర్షం తెలుపుతూ ఆ మొత్తాన్ని 50కోట్లు కు పెంచేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. దివ్యాంగులకు ఇంద్రధనస్సు పేరుతో ఆర్టీసీ లో ఉచిత ప్రయాణం కల్పించడం సంతోషమన్నారు. గ్రామీణ పేద రిక నిర్ములన కింద 1876కోట్లు కోట్లు కేటాయిచడం తో గ్రామీణ ప్రాంతాలలో స్వయం ఉపాధి పతకాలకు అవకాశం ఉంటుంది అన్నారు.దేవాలయాల అభివృద్ధి కి బడ్జెట్ లో ప్రాధాన్యత ఇచ్చారని అర్చకుల జీతాలు కూడా పెంచేటందుకు చర్యలు తీసుకోవాలని కోరారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగా లేక పోయిన దిగజారి న ఆర్థిక వ్యవస్థ ను మెరుగు పరచడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు కృషి ప్రశంస నీయమని ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపు తున్నట్లు పేర్కొన్నారు.

ఘనంగా సీనియర్ జర్నలిస్ట్ సత్య జన్మదిన వేడుకలు

ఎల్‌పీజీ కొరతపై కేంద్రానికి రాష్ట్ర విజ్ఞప్తి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *