యాదగిరిగుట్ట : ఫిబ్రవరి 16 : ( నేటి తెలుగు పత్రిక ప్రతినిధి ): యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట మండల కేంద్రంలోని మున్సిపాలిటీ ఎన్నికల్లో బిజెపి బోడ రాధా సురేష్ ఒకటో వార్డు నుండి ఆరో వార్డు కర్రే మాధవి ప్రవీణ్ విజయం సాధించడం జరిగింది. దీనికి హర్షం వ్యక్తం చేస్తూ బిజెపి మాజీ మండల అధ్యక్షులు కళ్లెం శ్రీనివాస్ గౌడ్ కర్రే ప్రవీణ్ కు మరియు బోడ సురేష్ కు శాలువాతో సన్మానం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో బిజెపి రాష్ట్ర నాయకులు రచ్చ శ్రీనివాసులు , గుంటుపల్లి సత్యం , జిల్లా నాయకులు కాదూరి అచ్చయ్య , దొంతు భరత్ , మండల నాయకులు గోపగాని ప్రసాద్ , కోలవిక్రమ్ , గ్రామ నాయకులు తదితరులు పాల్గొన్నారు జరిగింది.
