పామర్రు (పెదపారుపూడి), ఫిబ్రవరి 17, నేటి తెలుగు పత్రిక: పెదపారుపూడి మండల పరిధిలోని యల్లమర్రు గండికోడు పంట కాలువకు ఇరువైపులా దట్టమైన అడవికి మాదిరిగా పేరుకుపోయిన పిchhi మొక్కలతో సాగునీటికి అవరోధంగా ఉన్న వాటి తొలగింపుకు తక్షణ చర్యలు తీసుకోవాలని కోరుతూ య ల్లమర్రు గ్రామ రైతుల పక్షాన ఎమ్మెల్యే వర్ల కుమార్ రాజాకు మంగళవారం వినతి పత్రం అందజేశారు.ఈ సందర్భంగా రైతన్నలు మాట్లాడుతూ, వంటలు పండించిన రైతులు తమ ఉత్పత్తులను ఇండ్లకు చేర్చుకోవాలంటే రహదారికి ఇరువైపులా దట్టమైన చమకుల పెరిగిపోవడంతో పాటు కాలువల నీటి ప్రవాహానికి అవి అడ్డుపడటంతో వ్యవసాయానికి చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని వాటిని రానున్న ఖరీఫ్ సీజన్లో డెల్టా ఆధునికరంలో మరి మాత్రం నిర్వహించి రైతు సమస్యలు పరిష్కరించాలని ఎమ్మెల్యేని కోరామన్నారు. స్పందించిన ఎమ్మెల్యే వర్ల కుమార్ రాజా రైతు సమస్యల పరిష్కారానికి తక్షణ చర్యలు తీసుకోవడం జరుగుతుందని భరోసా ఇచ్చినట్లు చెప్పారు. కార్యక్రమంలో య ల్లమర్రు గ్రామ రైతులు జుజ్జువరపు రామనాథం కాండ్రు జ్యోతి తదితరులు వినతి పత్రం అందజేసిన వారిలో పాల్గొన్నారు.
