Breaking News

విద్యార్థి దశ నుంచే ఆరోగ్య సూత్రాలను తప్పక పాటించాలి: ఆయుర్వేద వైద్యాధికారిణి భాగ్యలక్ష్మి.

పామర్రు, ఫిబ్రవరి 17(నేటి తెలుగు పత్రిక): విద్యార్థి దశ నుంచే విద్యార్థులు విద్యార్థులు తమ ఆరోగ్య భద్రత లో ఆరోగ్య సూత్రాలు తప్పక పాటించాలని ఆయుర్వేదిక వైద్యాధికారిణి ఎం భాగ్యలక్ష్మి కోరారు. మంగళవారం మండల పరిధిలోని నిమ్మకూరు ఏపీఆర్జేసీ కళాశాల, పాఠశాల విద్యార్థులకు వైద్య ఆరోగ్య సదస్సును నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన భాగ్యలక్ష్మి విద్యార్థులకు ఆరోగ్యం పట్ల తీసుకోవలసిన పలు జాగ్రత్తలను సమగ్రంగా వివరించారు. పలువురు విద్యార్థులకు వచ్చిన సందేహాలను ఆమె నివృత్తి చేశారు. పలువురు విద్యార్థులకు వైద్య పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులను పంపిణీ చేశారు. కార్యక్రమంలో కళాశాల పాఠశాల ప్రిన్సిపల్స్, లక్ష్మీ కుమారి, ఎం బ్రహ్మేశ్వరి, ఇతర అధ్యాపక ఉపాధ్యాయులు సిబ్బంది పాల్గొన్నారు.

యూరియా విక్రయ కేంద్రాల ఆకస్మిక తనిఖీ.

జనగామ లో అడుగు పెట్టిన బీర్ల ఐలయ్య.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *