Breaking News

నులిపురుగుల నివారణకు మందులు పంపిణీ.

ఎ. కొండూరు ఫిబ్రవరి 17 (నేటి తెలుగు పత్రిక): జాతీయ నులిపురుగుల వారోత్సవాలను పురస్కరించుకొని మంగళవారం నులిపురుగుల నివారణ మాత్రలను (ఆల్బెండజోల్) పంపిణీ చేస్తున్నట్లు మండల ప్రాథమిక ఆరోగ్య కేంద్ర వైద్యాధికారులువేముల స్వాతి, పి దివ్య తెలిపారు. కస్తూర్బాగాంధీ బాలికల విద్యాలయంలో నులిపురుగుల నివారణకు మందులు పంపిణీ చేశారు.ఈ సందర్భంగా వైద్యాధికారులు మాట్లాడుతూ పిల్లలదగ్గర నుండి 19 సంవత్సరాల పిల్లల వరకు నులిపురుగు నివారణ మాత్రలను పంపిణీ చేసినట్లు తెలిపారు. అంగన్వాడీ కేంద్రాలు, ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలలు, ప్రైవేట్ విద్యాసంస్థల్లో, మాత్రలు పంపిణీ చేసినట్లు తెలిపారు. మండలంలో 98 శాతం మంది పిల్లలకు వేసినట్లు తెలిపారు.అలానే కడుపులో నులిపురుగులు రాకుండా ఉండాలంటే ప్రతి రోజు ఆహారం తీసుకునే ముందు విద్యార్థులు చేతులను శుభ్రం చేసుకోవాలన్నారు.కడుపులో నులిపురుగులు చేరితే రక్తహీనత వచ్చే ప్రమాదం ఉందన్నారు. విద్యార్థులు పరిసరాల పరిశుభ్రత పాటిస్తూ మంచి ఆహారాన్ని తీసుకోవాలని సూచించారు.ఈ కార్యక్రమంలో, తాహశీల్దార్ ఎన్. అరవింద్, డిప్యూటీ ఎంపీడీవో ఎడ్విన్ సుందర్ లాల్, ప్రిన్సిపాల్ విజయ సుందరి, ఆరోగ్య కేంద్ర సిబ్బంది పాల్గొన్నారు.

జనగణన నమోదు తోనే ప్రభుత్వ సంక్షేమ పథకాలు అమలకు జనగణన సర్వే ఎంతో కీలకం : పామర్రు ఎంపీడీవో కాండ్రు జ్యోతి

కాళేశ్వరం మరమ్మతులకు వేగం – సీఎం ఆదేశాలు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *