సమాధులపైగా ఫ్లైఓవర్ నిర్మాణం చేపట్టాలని ప్రభుత్వ ఆలోచన తీవ్ర ఆందోళన కలిగిస్తుంది.
స్థానిక ప్రజలతో సంపూర్ణ చర్చలు జరపాలి.
పిసిసి రాష్ట్ర మైనార్టీ ఉపాధ్యక్షుడు షేక్ మహబూబ్ బాషా.
రాయచోటి,ఫిబ్రవరి 18 (నేటి తెలుగు పత్రిక): మంగళగిరి యోజకవర్గం లోని ముస్లిం సోదరుల సమాధులపైగా ఫ్లైఓవర్ నిర్మాణం చేపట్టాలనే ప్రభుత్వ ఆలోచన మాకు తీవ్ర ఆందోళన కలిగిస్తోందని ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ రాష్ట్ర మైనార్టీ ఉపాధ్యక్షుడు షేక్ మహబూబ్ బాషా అన్నారు.సమాధులు కేవలం భూమి ముక్కలు కావు అవి ఒక సమాజపు భావోద్వేగాలని వారి ఆధ్యాత్మిక విశ్వాసాలు, పూర్వీకుల జ్ఞాపకాలకు ప్రతీకలని,భారత రాజ్యాంగం ప్రతి మతానికి సమాన గౌరవాన్ని, వారి ఆచార వ్యవహారాలకు రక్షణను హామీ ఇస్తుందని, అభివృద్ధి పేరుతో మతపరమైన సెంటిమెంట్లను దెబ్బతీయడం ప్రజాస్వామ్యానికి, సెక్యులర్ విలువలకు విరుద్ధం అని ఆయన చెప్పారు. బుధవారం మీడియాతో ఆయన మాట్లాడుతూమేము అభివృద్ధికి వ్యతిరేకం కాదు. కానీ అభివృద్ధి పేరుతో ఒక ప్రత్యేక వర్గ భావోద్వేగాలను పక్కన పెట్టడం అనైతికం. ప్రభుత్వం వెంటనే ప్రత్యామ్నాయ మార్గాలను పరిశీలించి, సంబంధిత మత పెద్దలు, స్థానిక ప్రజలతో సంపూర్ణ చర్చలు జరపాలని ఆయన రాష్ట్ర ప్రభుత్వానికి కోరారు. ఈ అంశంపై ప్రభుత్వం పారదర్శకంగా వ్యవహరించకపోతే, మైనారిటీ హక్కుల పరిరక్షణ కోసం కాంగ్రెస్ పార్టీ ప్రజాస్వామ్య పద్ధతుల్లో ఉద్యమించడానికి వెనుకాడమని ఆయన చెప్పారు.సామాజిక సమైక్యత, పరస్పర గౌరవం, రాజ్యాంగ పరిరక్షణ ఇవే మా ధ్యేయం అని అన్నారు. మంగళగిరి నియోజకవర్గం లో ముస్లిం సోదరుల సమాధుల పైగా ఫ్లైఓవర్ నిర్మాణం చేపట్టకముందే కూటమి రాష్ట్ర ప్రభుత్వం పునరాలోచించాలని ఆయన ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.
