మార్చి 18, (నేటి తెలుగు పత్రిక): ఒడిశాలో బీజేపీ బలపడటానికి డాక్టర్ దేవేంద్ర ప్రధాన్ కృషి కీలకమని కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు. ఆయనను ఒడిశా బీజేపీకి “భీష్మ పితామహుడు”గా అభివర్ణించారుభువనేశ్వర్లో నిర్వహించిన దేవేంద్ర ప్రధాన్ మొదటి వర్ధంతి కార్యక్రమంలో మాట్లాడుతూ, ఆయన సేవలను రాజ్నాథ్ సింగ్ గుర్తుచేశారు. రాజకీయాల్లో నిజాయితీ, విలువలు కాపాడిన అరుదైన నాయకుల్లో ప్రధాన్ ఒకరని ప్రశంసించారు.ఈ సందర్భంగా ‘స్మృతిరే డాక్టర్ బాబు’ పుస్తకాన్ని ధర్మేంద్ర ప్రధాన్తో కలిసి రాజ్నాథ్ సింగ్ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి ఒడిశా ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాఝీ, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మన్మోహన్ సమాల్ తదితరులు హాజరయ్యారు.డాక్టర్ దేవేంద్ర ప్రధాన్ తన జీవితాన్ని దేశానికి, సమాజానికి అంకితం చేశారని, ఆయన మాటలు–చర్యల్లో ఎప్పుడూ ఏకత్వం ఉండేదని రాజ్నాథ్ సింగ్ తెలిపారు. ఒడిశాలో బీజేపీ ఎదుగుదలకు ఆయన చేసిన కృషి చిరస్మరణీయమని అన్నారు.ఇక ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాఝీ కూడా దేవేంద్ర ప్రధాన్ జీవితం స్ఫూర్తిదాయకమని పేర్కొంటూ, సాధారణ స్థాయి నుంచి ఎదిగి పార్టీని బలోపేతం చేసిన నాయకుడిగా కొనియాడారు.

