Breaking News

SRH vs RCB కాదు.. IND vs PAK ఫీల్.. వీరేందర్ సెహ్వాగ్ సంచలన కామెంట్స్

మార్చి 22, నేటి తెలుగు పత్రిక: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 సీజన్ ప్రారంభానికి ముందే పెద్ద వివాదం తెరపైకి వచ్చింది. మార్చి 28న జరగనున్న సన్‌రైజర్స్ హైదరాబాద్ vs రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మ్యాచ్‌పై టీమిండియా మాజీ ఓపెనర్ వీరేందర్ సెహ్వాగ్ చేసిన వ్యాఖ్యలు సంచలనం సృష్టిస్తున్నాయి.ఈ మ్యాచ్‌ను సాధారణ ఐపీఎల్ గేమ్‌గా చూడొద్దని, ఇది భారత్-పాకిస్తాన్ మ్యాచ్‌లా భావించాలని సెహ్వాగ్ వ్యాఖ్యానించడం చర్చనీయాంశమైంది.

వివాదానికి కారణం ఏమిటి?

ఈ హీట్‌కు కారణం కావ్య మారన్ తీసుకున్న నిర్ణయం. ‘ది 100’ లీగ్ వేలంలో పాకిస్తాన్ స్పిన్నర్ అబ్రార్ అహ్మద్ను కొనుగోలు చేయడం సోషల్ మీడియాలో పెద్ద చర్చకు దారితీసింది. భారత ఫ్యాన్స్‌లో కొందరు దీనిపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

కమిన్స్ గాయం.. కిషన్‌కు కెప్టెన్సీ బాధ్యతలు

ఫ్యాన్స్ వార్‌కు రంగం సిద్ధం

సెహ్వాగ్ మాట్లాడుతూ, ఈ మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు అభిమానులే ఎక్కువగా కనిపిస్తారని, స్టేడియం మొత్తం ఆర్‌సీబీ రంగులతో నిండిపోతుందని వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

మ్యాచ్‌పై పెరిగిన హైప్

ఇప్పటికే IPL మ్యాచ్‌లకు భారీ క్రేజ్ ఉండగా, ఈ వివాదం కారణంగా SRH vs RCB మ్యాచ్‌పై మరింత ఉత్కంఠ నెలకొంది. కేవలం ఆట పరంగానే కాకుండా భావోద్వేగ పరంగానూ ఈ పోరు ప్రత్యేకతను సంతరించుకుంది.

వరల్డ్ కప్ హీరో తిలక్ వర్మకు సీఎం రేవంత్ రెడ్డి సత్కారం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *