Breaking News

SRH ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. జట్టులోకి ఇద్దరు స్టార్ ప్లేయర్లు

మార్చి 24, నేటి తెలుగు పత్రిక: సన్‌రైజర్స్ హైదరాబాద్ అభిమానులకు ఐపీఎల్ 2026 ప్రారంభానికి ముందు అదిరిపోయే గుడ్ న్యూస్ అందింది. జట్టు రెగ్యులర్ కెప్టెన్ పాట్ కమిన్స్ భారత్‌కు రావడానికి అనుమతి లభించింది. ఆయన మార్చి 24న బెంగళూరులో జట్టుతో కలవనున్నారు.వెన్ను గాయం కారణంగా కొంతకాలంగా దూరంగా ఉన్న కమిన్స్‌కు క్రికెట్ ఆస్ట్రేలియా ఎన్‌ఓసీ ఇచ్చింది. అయితే, పూర్తిస్థాయి ఫిట్‌నెస్ వచ్చే వరకు తొలి కొన్ని మ్యాచ్‌లకు ఆయన అందుబాటులో ఉండకపోవచ్చని సమాచారం.

తాత్కాలిక కెప్టెన్‌గా ఇషాన్ కిషన్
కమిన్స్ గైర్హాజరీలో జట్టు బాధ్యతలను ఇషాన్ కిషన్ కు అప్పగించారు. యువ ఆటగాడు అభిషేక్ శర్మ ను వైస్ కెప్టెన్‌గా నియమించారు. కమిన్స్ తిరిగి మైదానంలోకి వచ్చే వరకు ఈ జోడీ జట్టును నడిపించనుంది.

2027 వరల్డ్ కప్‌పై ఫోకస్.. ఆరుగురు పేసర్లకు చోటు ఫిక్స్! షమీకి షాక్?

మలింగ రాకతో బౌలింగ్ బలం పెరిగింది
ఇంకో గుడ్ న్యూస్ ఏమిటంటే, శ్రీలంక పేసర్ ఈషాన్ మలింగా జట్టుతో చేరనున్నాడు. ఫిట్‌నెస్ టెస్ట్ క్లియర్ చేసిన ఆయన తొలి మ్యాచ్ నుంచే అందుబాటులో ఉంటాడు. గత సీజన్‌లో మంచి ప్రదర్శన చేసిన మలింగ ఈసారి కూడా కీలక పాత్ర పోషించే అవకాశం ఉంది.

తొలి మ్యాచ్ డేట్ ఫిక్స్
మార్చి 28న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తో బెంగళూరులోని ఎం. చిన్నస్వామి స్టేడియం లో SRH తొలి మ్యాచ్ ఆడనుంది.

స్టేడియం అవసరం లేదు.. IPL 2026 ఫ్యాన్ పార్కులు రెడీ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *