మార్చి 24, నేటి తెలుగు పత్రిక: ఐపీఎల్ హంగామా నడుస్తున్న వేళ, భారత క్రికెట్ నియంత్రణ మండలి ఇప్పటికే 2027 వన్డే వరల్డ్ కప్పై దృష్టి సారించినట్లు సమాచారం. దక్షిణాఫ్రికా, జింబాబ్వే, నమీబియా వేదికలుగా జరిగే ఈ టోర్నీ కోసం 20 మంది కోర్ టీమ్ను సిద్ధం చేసినట్లు నివేదికలు చెబుతున్నాయి.
పేస్ దళానికి ప్రాధాన్యం
ఆఫ్రికా పిచ్లు పేస్కు అనుకూలంగా ఉండటంతో, భారత సెలెక్టర్లు బలమైన ఫాస్ట్ బౌలింగ్ విభాగాన్ని నిర్మించేందుకు కసరత్తు చేస్తున్నారు.
ఇప్పటికే ఆరుగురు ప్రధాన పేసర్లను ఫైనల్ చేసినట్లు తెలుస్తోంది:
- జస్ప్రీత్ బుమ్రా
- మహ్మద్ సిరాజ్
- హార్దిక్ పాండ్యా
- అర్ష్దీప్ సింగ్
- ప్రసిద్ కృష్ణ
- హర్షిత్ రాణా
అయితే గత వరల్డ్ కప్ స్టార్ మహమ్మద్ షమీ పేరు జాబితాలో లేకపోవడం చర్చనీయాంశంగా మారింది. ఫిట్నెస్, వయస్సు కారణాల వల్ల ఆయనకు మరోసారి నిరాశ ఎదురైనట్లు తెలుస్తోంది.
కోర్ టీమ్లో స్టార్ ప్లేయర్స్
20 మంది ప్రాథమిక జాబితాలో కెప్టెన్గా శుభమాన్ గిల్, వైస్ కెప్టెన్గా శ్రేయస్ అయ్యర్ పేర్లు వినిపిస్తున్నాయి.
👉 అనుభవజ్ఞులైన
- రోహిత్ శర్మ
- విరాట్ కోహ్లీ
కూడా జట్టులో కొనసాగే అవకాశం ఉంది.
👉 వికెట్ కీపర్లుగా
- రిషబ్ పంత్
- ఇషాన్ కిషన్
రేసులో ఉండగా,
Sanju Samson కూడా పోటీలో ఉన్నాడు.
ఆల్రౌండర్లలో
- రవీంద్ర జడేజా
- అక్షర్ పటేల్
- వాషింగ్టన్ సుందర్
ఫైనల్ టార్గెట్ – వరల్డ్ కప్
ఈ 20 మంది జాబితా నుంచి చివరకు 15 మందిని ఎంపిక చేసి ప్రధాన జట్టును ప్రకటించనున్నారు. యువ ఆటగాళ్లు, అనుభవజ్ఞుల కలయికతో ఈసారి వరల్డ్ కప్ గెలవాలన్న లక్ష్యంతో టీమ్ ఇండియా ముందుకు సాగుతోంది.ముఖ్యంగా షమీకి చోటు లేకపోవడం అభిమానుల్లో చర్చకు దారి తీస్తోంది.
