Breaking News

వారి కుటుంబాలపై ఇలాంటి పోల్స్ పెడతారా: ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్

మే 19, (నేటి తెలుగు పత్రిక): తన కుటుంబ సభ్యులపై అభ్యంతరకర పోల్స్ నిర్వహించారంటూ ఓ ఛానల్‌తో పాటు నిర్వాహకుడు వంశీపై బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.సోషల్ మీడియా వేదికగా స్పందించిన ఆయన.. “ఈసారి మిమ్మల్ని బండి సంజయ్, సీఎం రేవంత్ రెడ్డి కూడా కాపాడలేరు. చంచల్‌గూడ జైలు గోదావరి బ్యారక్ రెడీ అవుతోంది” అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.అలాగే సీఎం రేవంత్ రెడ్డి, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ, ఏపీ సీఎం చంద్రబాబు కుటుంబాలపై ఇలాంటి పోల్స్ పెట్టగలరా అని ప్రశ్నించారు. రాజకీయ నాయకుల కుటుంబ సభ్యులను లక్ష్యంగా చేసుకుని సోషల్ మీడియాలో దూషణలు, అభ్యంతరకర కంటెంట్ ప్రచారం చేయడం సరికాదని పేర్కొన్నారు.ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. సోషల్ మీడియాలో వ్యక్తిగత దూషణలు, కుటుంబ సభ్యులను లక్ష్యంగా చేసుకునే పోస్టులపై కఠిన చర్యలు తీసుకోవాలన్న డిమాండ్లు కూడా వినిపిస్తున్నాయి.

తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *