మే 19, (నేటి తెలుగు పత్రిక): హైదరాబాద్ పరిసర ప్రాంతంలో బీటెక్ విద్యార్థినిపై అత్యాచారం జరిగిన ఘటన కలకలం రేపింది. సహ విద్యార్థే మద్యం తాగించి దారుణానికి పాల్పడినట్లు పోలీసులు వెల్లడించారు.ఇబ్రహీంపట్నం ఎస్హెచ్వో మహేందర్రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. ఇంజినీరింగ్ మూడో సంవత్సరం చదువుతున్న చౌటుప్పల్కు చెందిన ఉదయ్ తన క్లాస్మేట్ను టీ తాగుదామని కారులో దిల్సుఖ్నగర్కు తీసుకెళ్లాడు. తిరుగు ప్రయాణంలో మద్యం కొనుగోలు చేసి, బీడీఎల్ ప్రాంతంలో ఆమెకూ తాగించినట్లు సమాచారం.మద్యం మత్తులో ఉన్న బాధితురాలిని అనంతరం ఇబ్రహీంపట్నం ప్రాంతానికి తీసుకెళ్లి ఓ గదిలో అత్యాచారానికి పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. ఘటన అనంతరం బాధితురాలు పోలీసులను ఆశ్రయించడంతో కేసు నమోదు చేశారు.ఫిర్యాదు ఆధారంగా నిందితుడు ఉదయ్ను అరెస్ట్ చేసిన పోలీసులు కోర్టులో హాజరుపరచగా, రిమాండ్కు తరలించినట్లు వెల్లడించారు. కేసుపై మరింత దర్యాప్తు కొనసాగుతోంది.
