మే 24, (నేటి తెలుగు పత్రిక): తెలంగాణ రాజకీయాల్లో కొత్త చర్చకు దారితీసేలా బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్ చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్గా మారాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఎవరికి అవకాశం ఇస్తే దాన్ని తిరస్కరించడం సులభం కాదని, అలాంటి ఒక రాజకీయ ఆఫర్ సీఎం రేవంత్రెడ్డికి కూడా ఇచ్చి ఉండవచ్చని ఆయన పేర్కొన్నారు.పశ్చిమ బెంగాల్లో సువేందు అధికారి, మహారాష్ట్రలో ఏక్నాథ్ షిండేలకు బీజేపీ ఇచ్చిన అవకాశాలను ఉదాహరణగా చూపుతూ, అదే తరహాలో రేవంత్రెడ్డికి కూడా ఆఫర్ వచ్చి ఉండొచ్చని అర్వింద్ వ్యాఖ్యానించారు. అయితే ఆ ప్రతిపాదనను ఆయన తిరస్కరించి ఉంటే భవిష్యత్తులో పశ్చాత్తాపపడే పరిస్థితి రావచ్చని అన్నారు.ఈ వ్యాఖ్యలతో రాష్ట్ర రాజకీయ వర్గాల్లో ఊహాగానాలు మొదలయ్యాయి. కాంగ్రెస్ నేతలు మాత్రం దీనిపై తీవ్రంగా స్పందిస్తూ, ప్రజాస్వామ్యంగా ఎన్నికైన ప్రభుత్వాన్ని అస్థిరపరిచేలా బీజేపీ వ్యాఖ్యలు చేస్తోందని విమర్శించారు.ఇదే సందర్భంలో పార్టీలో అంతర్గత విభేదాలు, పోక్సో కేసు వివాదం, అలాగే రాష్ట్ర బీజేపీ అధ్యక్ష పదవిపై తన అభిప్రాయాల గురించి కూడా అర్వింద్ స్పందించారు.
