మే 24, (నేటి తెలుగు పత్రిక): తెలంగాణలో ఉమ్మడి రాష్ట్ర కాలంలో కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ప్రారంభమై మధ్యలో నిలిచిపోయిన ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను పూర్తి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ ఇళ్లకు ప్రత్యేక ఆర్థికసాయం అందించాలని కేబినెట్ నిర్ణయించినట్లు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వెల్లడించారు.గోడలు, శ్లాబులు పూర్తికాని ఇళ్లకు రూ.3 లక్షల చొప్పున సహాయం అందించనున్నట్లు తెలిపారు. అలాగే గోడలు పూర్తై, శ్లాబు మాత్రమే మిగిలిన ఇళ్లకు రూ.2 లక్షల చొప్పున ఆర్థికసాయం ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు.ప్రతి నియోజకవర్గానికి 500 ఇళ్ల చొప్పున నిధులు కేటాయిస్తూ మంత్రివర్గం నిర్ణయం తీసుకున్నట్లు మంత్రి వివరించారు. పేదల సొంతింటి కలను నెరవేర్చడమే ప్రభుత్వ లక్ష్యమని ఆయన అన్నారు.ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు నిలిచిపోయి ఇబ్బందులు పడుతున్న కుటుంబాలకు ఈ నిర్ణయం పెద్ద ఊరటనివ్వనుందని ప్రభుత్వం భావిస్తోంది.
