మే 24, (నేటి తెలుగు పత్రిక): మేడ్చల్ పరిధిలో అనుమానాస్పదంగా సంచరిస్తున్న ఓ వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించగా కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఉత్తరప్రదేశ్కు చెందిన జయీద్ ఖాన్ అనే వ్యక్తి పాకిస్థాన్ గూఢచారి సంస్థ ఐఎస్ఐ మద్దతు ఉన్న ముఠాలతో సంబంధాలు కలిగి ఉన్నాడనే ఆరోపణలపై పోలీసులు అరెస్ట్ చేశారు. సోషల్ మీడియా ద్వారా దేశ వ్యతిరేక శక్తులతో సంప్రదింపులు జరుపుతున్నట్లు ప్రాథమిక విచారణలో తేలినట్టు సమాచారం. నిందితుడి మొబైల్ ఫోన్ను స్వాధీనం చేసుకున్న పోలీసులు వాట్సాప్ చాట్స్, వాయిస్ కాల్స్, ఇతర డిజిటల్ ఆధారాలను నిశితంగా పరిశీలిస్తున్నారు.దేశ భద్రతకు విఘాతం కలిగించే అంశాలపై అన్ని కోణాల్లో దర్యాప్తు కొనసాగుతోందని పోలీసులు తెలిపారు. నిందితుడికి మరెవరితోనైనా సంబంధాలు ఉన్నాయా? ఏవైనా సున్నితమైన సమాచారాన్ని పంపించాడా? అనే దానిపై కూడా విచారణ జరుగుతోంది.ఈ ఘటనతో మేడ్చల్ ప్రాంతంలో భద్రతా సంస్థలు అప్రమత్తమయ్యాయి. సోషల్ మీడియా వేదికలను ఉపయోగించి దేశ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు.
