Breaking News

ముందు ప్రజెంట్ సిటీని పట్టించుకో రేవంత్: కేటీఆర్

మే 24, (నేటి తెలుగు పత్రిక): ఫ్యూచర్ సిటీ నిర్మాణంపై మాట్లాడే ముందు ప్రస్తుతం ఉన్న హైదరాబాద్ నగర సమస్యలను పరిష్కరించాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రభుత్వాన్ని కోరారు. అంబర్‌పేట్‌లో పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడిన ఆయన.. నగరంలో మౌలిక వసతుల పరిస్థితిపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.హైదరాబాద్‌లో రోడ్లు దెబ్బతిన్నాయని, డ్రైనేజీ వ్యవస్థ సరిగా లేదని కేటీఆర్ విమర్శించారు. దోమల నివారణ చర్యలు కూడా సక్రమంగా చేపట్టడం లేదని ఆరోపించారు. నగర అభివృద్ధి పూర్తిగా నిలిచిపోయిందని ఆయన అన్నారు.ఒకవైపు ఫ్యూచర్ సిటీ నిర్మిస్తామని ప్రభుత్వం గొప్పలు చెప్పుకుంటోందని, కానీ ప్రస్తుతం ఉన్న నగరాన్ని సక్రమంగా నిర్వహించడంలో విఫలమవుతోందని కేటీఆర్ మండిపడ్డారు. ప్రజలు ఎదుర్కొంటున్న ప్రాథమిక సమస్యలపై ముందుగా దృష్టి పెట్టాలని సూచించారు.ప్రస్తుతం ఉన్న హైదరాబాద్‌ను అభివృద్ధి చేయలేని ప్రభుత్వం భవిష్యత్ నగర నిర్మాణం ఎలా చేపడుతుందని ఆయన ప్రశ్నించారు. నగర ప్రజలకు మెరుగైన మౌలిక వసతులు కల్పించడమే ప్రభుత్వ ప్రధాన బాధ్యత కావాలని కేటీఆర్ పేర్కొన్నారు.

మేడ్చల్‌లో టెర్రరిస్టులతో టచ్‌లో ఉన్న వ్యక్తి అరెస్ట్

ధాన్యం కొనుగోళ్లలో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు: నిరంజన్ రెడ్డి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *