Breaking News

"Congress party is cheating BCs" - R. Krishnaiah

కుల గణన పూర్తి అయినప్పటికీ జాప్యం ఎందుకు?

స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్ 42 శాతం పెంచాలి: ఆర్. కృష్ణయ్య హెచ్చరిక

హైదరాబాద్:
స్థానిక సంస్థల ఎన్నికలలో బీసీ రిజర్వేషన్లు 42 శాతం పెంచిన తర్వాతే ఎన్నికలు నిర్వహించాలని, లేదంటే రాష్ట్రం రణరంగంగా మారుతుందని రాజ్యసభ సభ్యులు ఆర్. కృష్ణయ్య హెచ్చరించారు. బీసీలకు వ్యతిరేకంగా జరుగుతున్న చర్యలను వెంటనే నిలిపివేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

రెవంత్ రెడ్డిపై డిమాండ్:
బీసీ రిజర్వేషన్ల పెంపుపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తక్షణమే స్పష్టమైన ప్రకటన చేయాలని కృష్ణయ్య పేర్కొన్నారు. సోమవారం కాచిగూడ అభినందన గ్రాండ్ హోటల్‌లో బీసీ సంక్షేమ సంఘం మేడ్చల్ జిల్లా ప్రధాన కార్యదర్శిగా నియమితులైన శ్రీరామ్ జ్ఞానేశ్వర్కు నియామక పత్రం అందజేసిన సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ని కలిసిన వేములవాడ శ్రీ రాజ రాజేశ్వర

కుల గణన పూర్తి అయినప్పటికీ జాప్యం ఎందుకు?
కుల గణన పూర్తయినప్పటికీ, రిజర్వేషన్లు పెంచడంలో ప్రభుత్వం జాప్యం చేస్తోందని కృష్ణయ్య ప్రశ్నించారు. స్థానిక సంస్థలలో బీసీ రిజర్వేషన్లు 42 శాతానికి పెంచుతూ అసెంబ్లీలో ప్రత్యేక చట్టం తీసుకురావాలని డిమాండ్ చేశారు.

ప్రస్తుతం బీసీల పరిస్థితి:
ప్రస్తుతం సర్పంచ్, ఎంపీటీసీ, జడ్పీటీసీ స్థానాలలో బీసీలకు కేవలం 20 శాతం మాత్రమే రిజర్వేషన్లు ఉన్నాయని, వాటిని 42 శాతానికి పెంచితేనే బీసీలు రాజకీయంగా అభివృద్ధి సాధిస్తారని కృష్ణయ్య అభిప్రాయపడ్డారు.

విద్య, ఉద్యోగాలలో బీసీలకు న్యాయం:

Tomorrow is a holiday
రేపు, ఎల్లుండి సెలవు
  • విద్య, ఉద్యోగ రంగాలలో బీసీ రిజర్వేషన్లను 50 శాతానికి పెంచాలని ఆయన సూచించారు.
  • బీసీలకు చెందిన అన్ని కులాల కోసం కార్పొరేషన్లు ఏర్పాటు చేసి, ఒక్కొక్క దానికి ₹1,000 కోట్ల బడ్జెట్ కేటాయించాలని డిమాండ్ చేశారు.

సంక్షేమ కార్యక్రమాలకు కృషి:
బీసీ సంక్షేమానికి ప్రభుత్వం మరింత కృషి చేయాలని, వారి హక్కులను కాపాడటానికి బీసీ సంఘం పోరాడుతుందని ఆయన అన్నారు. రిజర్వేషన్ల పెంపు విషయంలో ప్రభుత్వం మరోసారి నిర్లక్ష్యం చూపితే, తీవ్ర ఉద్యమాలు జరగడం తథ్యమని కృష్ణయ్య స్పష్టం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *