నాగార్జునసాగర్ నుంచి ఏపీకి 12 టీఎంసీల నీరు
నాగార్జునసాగర్ డ్యామ్ నుండి ఆంధ్రప్రదేశ్కు 12 టీఎంసీల నీరు విడుదల చేయనున్నది.
ఏపీ ప్రభుత్వం కృష్ణా నది యాజమాన్య బోర్డు (KRMB)ను 15.86 టీఎంసీల నీటిని విడుదల చేయాలని అభ్యర్థించింది. ఈ మేరకు, ఇప్పటికే రాష్ట్రం వాడుకున్న నీటిని పరిగణనలోకి తీసుకుని, జనవరి 31 వరకు 12 టీఎంసీల నీటిని విడుదల చేయడానికి KRMB అనుమతి ఇచ్చింది.
గత నెల 25వ తేదీ నాటికి 9.55 టీఎంసీల నీటిని వాడుకున్నామని, 32.25 టీఎంసీల నీటిని వాడుకునేందుకు అర్హత ఉన్నట్లు ఏపీ ప్రభుత్వం తన లేఖలో వివరించింది.
