విజయవాడ. జనవరి 31 ఏ సునీల్ కుమార్. నేటి తెలుగు పత్రిక ప్రతినిధి..!
పశ్చిమ నియోజకవర్గం 34 వ డివిజన్ కు చెందిన 56 సంవత్సరాల గట్టు పుల్ల మ్మ కిడ్నీ కి సంబంధించిన వ్యాధితో బాధ పడుతోంది. ఆమెకు సర్జరీ చేయాలని వైద్యులు సూచించారు. ఆర్థికంగా స్తోమత లేని వారు కావడంతో కుటుంబ సభ్యులు ఎమ్మెల్యే సుజనా చౌదరి కార్యాలయాన్ని సంప్రదించారు. వెంటనే పశ్చిమ ఎమ్మెల్యే సృజనా చౌదరి సీఎం ఆర్ ఎఫ్ కు లేఖ రాసారు. పుల్లమ్మ కు వైద్య ఖర్చుల నిమిత్తం అవసరమయ్యే 9,80,000/_ రూపాయలు మంజూరు చేయాలని లేఖ రాసారు. దీనికి సంబంధిం చిన ఎల్వోసీ పత్రాలను సుజనా చౌదరి కార్యాల యంలో బాధిత కుటుంబ సభ్యులకు అంద చేశారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకురాలు మల్లేపు విజయలక్ష్మి, కార్యాలయ కార్యదర్శి ప్రత్తిపాటి శ్రీధర్, కూటమి నాయకులు, సుజనా మిత్రలు పాల్గొ న్నారు. కుటుంబ సభ్యులు ఎమ్మెల్యే సుజనా చౌదరికి కృతజ్ఞతలు తెలిపారు.

