Breaking News

వైభవంగా ప్రారంభమైన గుణదల మేరీ మాత ఉత్సవాలు

విజయవాడ:విజయవాడలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన గుణదల మేరీ మాత (అవర్ లేడీ ఆఫ్ లూర్డ్స్) వార్షిక మహోత్సవాలు అత్యంత భక్తిశ్రద్ధలతో ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా విజయవాడ కాథలిక్ పీఠాధిపతులు బిషప్ తెలగతోటి జోసెఫ్ రాజారావు మాట్లాడుతూ, ఈ ఏడాది కూడా మేరీ మాత నవ అనుదిన ప్రార్థనలు మరియు ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు.గత 102 ఏళ్లుగా ఈ క్షేత్రంలో మేరీ మాత ఉత్సవాలను నిరంతరాయంగా నిర్వహిస్తున్నారు. ఏటా భక్తుల సంఖ్య గణనీయంగా పెరుగుతోందని బిషప్ పేర్కొన్నారు.

ఘనంగా కామ్రేడ్ ధర్మభిక్షం గౌడ్ జయంతి వేడుకలు.

ప్రధాన ఉత్సవాలు: ఫిబ్రవరి 9, 10 మరియు 11 తేదీలలో ప్రధాన వేడుకలు జరగనున్నాయి. ఈ మూడు రోజుల పాటు లక్షలాది మంది భక్తులు మాతను దర్శించుకుంటారు. ఉత్సవాలకు ముందే తొమ్మిది రోజుల పాటు ప్రత్యేక నవదిన ప్రార్థనలు ఘనంగా జరుగుతాయి. ఇందులో భాగంగా కొండపైకి ఊరేగింపులు, ప్రత్యేక ప్రార్థనలు మరియు దివ్యబలి పూజలు నిర్వహిస్తారు.కేవలం ఆంధ్రప్రదేశ్ నుండే కాకుండా, తెలంగాణ మరియు ఇతర పొరుగు రాష్ట్రాల నుండి కూడా వేలాది మంది భక్తులు ఈ వేడుకల్లో పాల్గొంటారు.మేరీ మాతను దర్శించుకోవడం వల్ల తమ కష్టాలు తీరుతాయని, ముఖ్యంగా అనారోగ్య సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు ఉన్నవారు, సంతానం లేని వారు మరియు నిరుద్యోగులు మాత చెంతకు వచ్చి ప్రార్థనలు చేసుకుంటారని బిషప్ తెలిపారు. మాత దీవెనలతో అనేక మందికి మేలు జరుగుతోందని, అందుకే భక్తులు ఏటా రెట్టింపు ఉత్సాహంతో ఇక్కడికి వస్తారని ఆయన వివరించారు.

ఏపీలో సూపర్ న్యూస్.. మహాశివరాత్రి సందర్భంగా సోమవారం ఆప్షనల్ హాలీడే.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *