యాదగిరిగుట్ట : ఫిబ్రవరి 01 : ( నేటి తెలుగు పత్రిక ప్రతినిధి ): మోటకొండూర్ మండలం ఆరెగూడెం గ్రామానికి చెందిన క్రీ॥శే॥కొల్లూరి (క్రాస్) పోచయ్య గారు ఇటీవల అనారోగ్యంతో బాధపడుతూ మరణించిన విషయం తెలుసుకున్న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆలేరు శాసనసభ్యులు బీర్ల ఐలయ్యా గారి సతీమణి బీర్ల ఫౌండేషన్ చైర్మన్ బిర్ల అనితమ్మ తరుపున 50 కిలోల బియ్యంను స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకులు ద్వారా పంపిణీ చేశారు.ఈ కార్యక్రమంలో ఆరేగూడెం సర్పంచ్ మరియు గ్రామ శాఖ అధ్యక్షులు పేరబోయిన దివ్య మకరజ్యోతి కార్తీక్ ఉపసర్పంచ్ కొల్లూరి లత నాగరాజు, ఉపాధ్యక్షులు పేరబోయిన చంద్రయ్య, కొల్లూరి సంజీవ,మాజీ గ్రామ శాఖ అధ్యక్షులు కొల్లూరి అంజనేయులు మోటకొండూర్ మండల సోషల్ మీడియా కొల్లూరి హరిబాబు గ్రామ పంచాయతీ వార్డు సభ్యులు పుల్లె భాస్కర్, మారబోయిన పద్మ పాండు ,పేరబోయిన మాధురి శ్రీకాంత్,కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు మరిబోయిన క్రాంతి, కొల్లూరి ప్రశాంత్,కొల్లూరి నర్సిగారావు గ్రామస్థులు కొల్లూరి నాగరాజు,కొల్లూరి మహేందర్ తదితరులు పాల్గొన్నారు.

