- ఆలేరు బి.ఆర్.ఎస్ పార్టీ నేతల నల్ల జెండాలుదరించి నిరసన కార్యక్రమం.
- అంబేద్కర్ కు వినతి పత్రం అందజేసిన మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునీత.
యాదగిరిగుట్ట : ఫిబ్రవరి 01 : ( నేటి తెలుగు పత్రిక ప్రతినిధి ): తెలంగాణ జాతిపిత, బిఆర్ఎస్ అధినేత, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి అక్రమ నోటీసులు ఇచ్చి సిట్ విచారణకు పిలవడాన్ని వ్యతిరేకిస్తూ ఆలేరు పట్టణంలో నల్లజెండాలు ధరించి నిరసన తెలుపుతూ, రేవంత్ రెడ్డి గారికి కాంగ్రెస్ సర్కార్ కు సద్బుద్ధి ఇవ్వాలని కోరుతూ అంబేద్కర్ గారికి వినతి పత్రం అందజేసిన మాజీ ప్రభుత్వ విప్, ఆలేరు మాజీ ఎమ్మెల్యే, బిఆర్ఎస్ నియోజకవర్గ ఇంచార్జ్ శ్రీమతి గొంగిడి సునీత మహేందర్ రెడ్డి గారు ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

