పులివెందుల ఫిబ్రవరి 1 (నేటి తెలుగు పత్రిక ప్రతినిధి): వైసీపీ మాజీ మంత్రి అంబటి రాంబాబు సమాజంలో తిరిగే అర్హత లేదని టిఎన్ఎస్ఎఫ్ మండల శాఖ అధ్యక్షుడు యాసిన్ ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు పేర్కొన్నారు. సిఎం చంద్రబాబు తల్లికి అసభ్య పదజాలంతో దూషించడం సరైనది కాదన్నారు. ఇలాంటి నాయకులు సమాజంలో తిరగనివ్వ కుండా ప్రజలందరూ ఎదురు తిరగాలని కోరారు. ఇలాంటి బాష మాట్లాడు తుండడంతోనే వైసీపీకి ప్రతిపక్ష హోదా కూడ రాలేదని చెప్పారు. వైసిపి అధినేతకు బుద్ది లేక పోవడంతో నే ఇలాంటి వ్యక్తులను పార్టీ లో పెట్టుకోవడం జరిగిందని చెప్పారు. అంబటి చేసిన వ్యాఖ్యలను టిఎన్ఎస్ఎఫ్ ఖండిస్తున్నట్లు చెప్పారు.సభ్య సమాజం తల దించుకొనేలాగా వ్యాఖ్యలు ఉన్నట్లు చెప్పారు. నారా కుటుంబానికి అంబటి బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. భవిష్యత్తులో ఇలాంటి భాషలను మాట్లాడకుండా చేసేందుకు చట్టాలను తీసుకొని రావాలని కోరారు. అంబటి పై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు.

