పులివెందుల ఫిబ్రవరి 1 ( నేటి తెలుగు పత్రిక ప్రతినిధి): ఏడాదిలోపు హైడ్రో పవర్ ప్లాంట్ ను పూర్తి చేస్తామని గ్రూపు సంస్థల చైర్మన్ గౌతమ్ అదాని అన్నారు. లింగాల మండలం పార్లపల్లె చిత్రావతి ప్రాజెక్ట్ సమీపంలో సుమారు రూ. 2300 కోట్ల వ్యయంతో 500 మెగావాట్ల తో నిర్మించనున్న హైడ్రో పవర్ ప్లాంట్ ను ఆదివారం ఆయన పరిశీలించారు. ఆదివారం ఆయన కుమారుడితో కలిసి హెలికాప్టర్ ద్వారా పార్నపల్లె చేరుకున్నారు. ఈ సందర్భంగా విచ్చేసిన ఆయనకు డి.ఎస్.పి మురళి నాయక్, పులివెందుల రూరల్ సీఐ రమణ లు స్వాగతం పలికారు. అనంతరం ఆయన పవర్ ప్రాజెక్టును సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పవర్ ప్లాంట్ ప్రాజెక్ట్ పనులు చురుగ్గా సాగుతున్నాయి అన్నారు. బహుశా ఈ ఏడాది డిసెంబరు ఆఖరు నాటికి పవర్ ప్రాజెక్ట్ పూర్తవుతుందని ఆయన సూచనప్రాయంగా వెల్లడించారు. ఆయన వెంట కుమారుడు సీఈవో జిత్ అదాని, పలువురు అధికారులు ఉన్నారు.

