Breaking News

IND vs PAK: టీ20 వరల్డ్‌కప్ మ్యాచ్‌పై పాక్ బహిష్కరణ – అసలు కారణాలపై స్పష్టత

నేటి తెలుగు పత్రిక ప్రతినిధి: క్రికెట్ ప్రపంచంలో అత్యంత ఆసక్తిగా ఎదురుచూసే భారత్–పాకిస్థాన్ మ్యాచ్ మరోసారి వార్తల్లో నిలిచింది. టీ20 వరల్డ్‌కప్‌లో భాగంగా టీమిండియాతో జరగాల్సిన మ్యాచ్‌ను బహిష్కరిస్తున్నట్లు పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (PCB) ప్రకటించడం చర్చకు దారితీసింది.ఈ నిర్ణయం వెనుక రాజకీయ, భద్రతా అంశాలే ప్రధాన కారణాలని క్రీడా వర్గాలు పేర్కొంటున్నాయి. అయితే సోషల్ మీడియాలో మాత్రం ఈ అంశాన్ని మరింత అతిశయోక్తిగా ప్రచారం చేస్తూ, భారత యువ క్రికెటర్లు ఇషాన్ కిషన్, అభిషేక్ శర్మల దూకుడు బ్యాటింగ్‌నే పాక్ వెనకడుగుకు కారణమన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.ఇటీవల న్యూజిలాండ్‌తో జరిగిన టీ20 సిరీస్‌లో ఇషాన్ కిషన్, అభిషేక్ శర్మ పవర్‌ప్లేలోనే వేగంగా పరుగులు సాధించి ప్రత్యర్థి బౌలర్లపై ఆధిపత్యం చూపించారు. వారి ఫియర్‌లెస్ అప్రోచ్ టీమిండియా బ్యాటింగ్‌కు బలంగా మారింది.

ఘనంగా సీనియర్ జర్నలిస్ట్ సత్య జన్మదిన వేడుకలు

అయితే, కేవలం ఆటగాళ్ల ప్రదర్శన ఆధారంగా ఒక అంతర్జాతీయ మ్యాచ్‌పై బహిష్కరణ నిర్ణయం తీసుకోవడం సాధ్యం కాదని క్రికెట్ నిపుణులు స్పష్టం చేస్తున్నారు. ఇలాంటి నిర్ణయాల వల్ల పాకిస్థాన్‌కే ఆర్థికంగా, ఐసీసీ నిధుల విషయంలోనూ నష్టం జరిగే అవకాశముందని విశ్లేషిస్తున్నారు.భారత్–పాకిస్థాన్ మ్యాచ్ విషయంలో పీసీబీ తన నిర్ణయాన్ని మార్చుకుంటుందా? లేక ఈ పరిణామాన్ని కొనసాగిస్తుందా? అన్నది ఆసక్తిగా మారింది.

ఎల్‌పీజీ కొరతపై కేంద్రానికి రాష్ట్ర విజ్ఞప్తి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *