కోదాడ ,ఫిబ్రవరి 2. (నేటి తెలుగు పత్రిక) హుజూర్నగర్ డివిజన్ విద్యుత్ డీఈ వెంకట కృష్ణయ్యకు. మండల పరిధిలోని నర్సింహాపురం గ్రామపంచాయతీ సర్పంచ్ డాక్టర్ వేమూరి సత్యనారాయణ. గ్రామంలో. జనావాసాల మధ్య ఉన్న సింగల్ ఫేస్ ట్రాన్స్ఫార్మర్లను. వేరే చోటకు మార్పు చేయాలని అలాగే గతంలో విద్యుత్ స్తంభాలను ఏర్పాటుచేసి వాటికి విద్యుత్తు తీగలను ఏర్పాటు చేయని వాటికి నూతనంగా విద్యుత్ తీగలను ఏర్పాటు చేయాలని అవసరమైన చోట మధ్య మధ్యలో విద్యుత్ స్తంభాలను ఏర్పాటు చేయాలని. గ్రామంలో ఎస్సీ కాలనీ నుంచి వైకుంఠధామం వరకు ఏర్పాటు చేసిన విద్యుత్ స్తంభాలకు సరఫరా లేనందున. దానిని పునరుద్ధరించాలని గ్రామంలో వివిధ వార్డులలో నూతనంగా కొత్తగా విద్యుత్ స్తంభాలను ఏర్పాటు చేయాలని. వినతి పత్రంలో కోరారు అదే విధంగా విధి నిర్వహణలో అలసత్వం నిర్లక్ష్య వైఖరి అవలంబిస్తున్న సంబంధిత మండల ఏఈ మరియు క్షేత్రస్థాయి సిబ్బంది తీరు మార్చుకునేలాగా వారికి. హెచ్చరికలు జారీచేయాలని ఇకనుంచి గ్రామంలో విద్యుత్తుకు సంబంధించి ఎలాంటి సమస్యలు ఉన్న సకాలంలో స్పందించి. తగిన విధంగా చర్యలు చేపట్టాలని. వినతి పత్రంలో కోరినట్లు సత్యనారాయణ తెలిపారు. ఈ సందర్భంగా సత్యనారాయణ మాట్లాడుతూ మండల ఏఈ. స్థానిక ప్రజాప్రతినిధులు విద్యుత్తు సమస్యలను వారి దృష్టికి తీసుకువస్తే వెంటనే స్పందించాలని అవకాశం ఉన్నంతవరకు త్వరితగతిన పరిష్కరించాలని ఇక నుంచి అయినా స్థానిక అధికారుల తీరు మార్చుకోవాలని, నిర్లక్ష్యపు వైఖరిని విడనాడాలని పై స్థాయి అధికారులను చూసైనా మారాలని హితవు పలికారు. స్పందించిన డీఈ. అవకాశం ఉన్నంతవరకు గ్రామంలో ఉన్న సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని అక్కడే ఉన్న సంబంధిత ఏఈ కి ఆదేశాలు ఇచ్చారని సత్యనారాయణ ఒక ప్రకటనలో తెలిపారు. తదుపరి డి ఈ ని. శాలువాతో సన్మానించినట్లు ఆయన తెలిపారు.

