యాదగిరిగుట్ట ఫిబ్రవరి 02 : ( నేటి తెలుగు పత్రిక ప్రతినిధి ): ఆలేరు పట్టణంలో 7వ వార్డు సిల్క్ నగర్ కాలనీలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి శ్రీమతి బీజన బాలమణి భాస్కర్ గారు కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు, ,పెద్దలు స్థానిక కాలనీ వాసులతో కలిసి విస్తృత ప్రచారం నిర్వహించడం జరిగింది.వార్డు సమస్య తెలుసుకుంటూ, ప్రభుత్వ విప్ ఐలన్న గారి సహకారంతో వార్డును అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తానని హామీ ఇస్తూ విస్తృతంగా ప్రచారం చేయడం జరిగింది.

